Logo

కారు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి..విద్యార్దులకు గాయాలు

కారు, ఆటో ఢీ ఒకరు మృతి

విద్యార్దులకు గాయాలు

సిద్దిపేట జిల్లా : చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ గ్రామ శివారులో అదుపుతప్పి కారు బోల్తా పడి ఒక్కరు మృతి చెందారు. రాజీవ్ రహదారిపై సంఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో పెద్ద కోడూరుకు చెందిన స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో ఆగడం.. వెనుక నుంచి వస్తున్న మరొక కారు ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. గాయపడిన
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking