Logo

రైళ్లపై రాళ్లు రువ్వకండి

రైళ్లపై రాళ్లు రువ్వకండి

సికింద్రాబాద్ : ఇటీవల వందే భారత్ రైలుపై జరిగిన రాళ్ల దాడిపై రైల్వే శాఖ స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ ఆస్తులకు నష్టం లేదా విఘాతం కలిగించే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని కోరింది.

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి కార్యకలాపాలను అరికట్టేందుకు సహకరించాలని కోరింది. ఇటీవల కాలంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసారు. భారత దేశ ప్రజలకు రైల్వేలు 160 సంవత్సరాల నుండి రవాణా రంగంతో పాటు వివిధ రకాలైన సేవలు చేయడమే కాకుండా దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయని గుర్తు చేసింది. ఈ దాడుల మూలాన జరిగిన న నష్టాన్ని తిరిగి ప్రజలే భరించవలసి ఉంటుంది . కాబట్టి ప్రజలకు సంబంధించిన ఆస్తులకు నష్టం కలిగించవద్దని రైల్వే శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking