యాదాద్రి భువనగిరి జిల్లాలో
ఘోర రోడ్డుప్రమాదం నలుగురు దుర్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శ్వేత తెలుగు ఫుడ్స్ కు చెందిన బస్సు కూలీల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పలువురు మహిళా కూలీలకు గాయాలు కావడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. బాధితులు చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారం గ్రామస్తులుగా గుర్తించారు. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.