కేసీఆర్ 420..రేవంత్ జైలుకు పోయిన దొంగ : షర్మిల
పాలకుర్తి : పాలకుర్తిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారికి ఘన స్వాగతం లభించింది. బుధవారం ఆమె స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు.
షర్మిల మాట్లాడుతూ డిగ్రీ కాలేజీ తెచ్చుకోలేనొడు మంత్రి అంట. పాలకుర్తి,చెన్నూరు రిజర్వాయర్ లతో వైఎస్సార్ సాగునీరు ఇద్దాం అనుకున్నారు. ఇప్పటికీ ఈ రిజర్వాయర్లను ఎందుకు పూర్తి చేయలేక పోయారు. టిడిపి లో ఉన్నప్పుడు కేసీఅర్..రాక్షసుడు.. ఇప్పుడు దేవుడా.. అని ప్రశ్నించారు.
పాలకుర్తిలో రేవంత్ పాదయాత్ర చేస్తున్నాడా..? కార్ యాత్ర చేస్తున్నాడా..? . పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు. పంచాయతీలు ఎలా నడపాలి అంటే మీ మంత్రి ఒక మాట అన్నాడు. ఖాళీగా ఉన్న బీరు బాటిళ్లు అమ్ముకోవాలి అన్నాడు. సర్పంచులకు నిధులు ఇవ్వక ఇబ్బందులు పెడుతున్నారు. ఇదే పాలకుర్తి నియోజక వర్గానికి వైఎస్సార్ హయాంలో 70వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని అనుకున్నారు.
చెన్నూరు,పాలకుర్తి రిజర్వాయర్ లకు అనుమతులు ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభం అయిన ఈ రిజర్వాయర్లను ఇప్పటికీ పూర్తి చేయలేదు. నియోజక వర్గంలో కనీసం డిగ్రీ కాలేజీ కూడా లేదు. కనీసం ఇంటర్ కాలేజీ కూడా లేదు. మంత్రి అయ్యి ఉండి డిగ్రీ కాలేజీ కూడా తెచ్చుకొలేని మంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత అని అన్నారు.
పాలకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏమయ్యింది..? కనీసం పోస్ట్ మార్టం చేసే గది కూడా లేదు. కొలుకొండ గుట్టలను సైతం గ్రానైట్ కంపెనీలకు పట్టాలు చేయించాడట. 100ల ఎకరాలు ఈ మంత్రి కి ఉన్నాయట..లక్షల కొద్దీ రైతు బందు తీసుకుంటున్నాడట. టిడిపి లో ఉన్నప్పుడు కేసీఅర్ ను రాక్షసుడు అన్నాడు. తెరాస లో చేరిన తర్వాత కేసీఆర్ దేవుడు అయ్యాడు. కేసీఅర్ దేవుడు అయితే మీ నియోజక వర్గంలో ఎక్కడ అభివృద్ది అని నిలదీసారు. వైఎస్సార్ ను పాలకుర్తి ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకొనే ఉన్నారు.