మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ను ఎన్ఐఏ
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ను ఎన్ఐఏ టార్గెట్ చేసింది. గాజర్ల రవి ఉగ్రవాది అని.. ఆయన్ను పట్టిస్తే పది లక్షల నజరానా ఇస్తామని ఏఓబీలో వాల్ పోస్టర్లు వెలిశాయి.
గాజర్ల రవి స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల. 1992లో నక్సల్స్ ఉద్యమంలో చేరారు. 2004లో అప్పటి పీపుల్స్ వార్ ప్రతినిధిగా ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నారు. రవిని ఉగ్రవాది అంటూ ఎన్ఐఏ వేసిన తాజా పోస్టర్లపై చర్చ జరుగుతోంది.